లండన్: ఇంగ్లండ్తో జరిగిన రెండవ టెస్టులో ఇండియా అద్భుత విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సంబరాన్ని కెప్టెన్ విరాట్ ( Virat Kohli ) తన భార్య అనుష్కా శర్మతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ మరుసటి రోజు టీమిండియా కెప్టెన్ కోహ్లీ లంచ్కు వెళ్లాడు. లండన్లో ఉన్న టెండ్రిల్ రెస్టారెంట్లో అనుష్కాతో కలిసి శాఖాహార భోజనం చేశాడు. అయితే ఆ రెస్టారెంట్ తన ఇన్స్టాలో చెఫ్తో కలిసి దిగిన విరుష్కా జంట ఫోటోను పోస్టు చేసింది. బహుశా మీరు లంచ్ ఎంజాయ్ చేసి ఉంటారని ఆ రెస్టారెంట్ తన ట్యాగ్లో పేర్కొన్నది.
విరాట్ కోహ్లీ, అనుష్కాలు ఇద్దరూ వెగన్ లవర్స్. శాఖాహార ఫుడ్ను వాళ్లు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. లండన్లో రెస్టారెంట్కు వెళ్లిన ఆ ఇద్దరూ మాస్క్లు ధరించారు. రెస్టారెంట్ చెఫ్ రిషిమ్ కూడా ఆ ఫోటోలో ఉన్నాడు. విరుష్కా జంట ఆ రెస్టాంట్ సిబ్బందితో దిగిన మరో ఫోటోను కూడా షేర్ చేసింది. ఇక అనుష్కా శర్మ కూడా తన ఇన్స్టాగ్రామ్లో తాము భుజించిన ఆహారానికి సంబంధించిన ఓ ఫోటోను షేర్ చేసింది. బెస్ట్ వెజిటేరియన్ ఫుడ్ ఎవర్ అంటూ ఆ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చిందామె.