Virat-Anushka | బాలీవుడ్ ఉన్న క్యూట్ కపుల్స్లో విరాట్ కోహ్లీ (Virat Kohli), అనుష్క శర్మ (Anushka Sharma) జంట ఒకటి. వీరిద్దరూ నిత్యం ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తుంటారు. అటు విరాట్ క్రికెట్లో.. ఇటు అనుష్క సినిమాలతో ఎంతా బీజిగా ఉన్న కూడా ఫ్యామిలీ లైఫ్ని ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం హాలీడే ట్రిప్లో ఉన్న ఈ జంట తాజాగా ఇన్స్టాలో ఓ ఫొటో షేర్ చేసింది.
కరేబియన్లోని బార్బడాస్ (Barbados)లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ హాలీడే ట్రిప్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ జంట విధుల్లో తిరుగుతూ అక్కడున్న స్ట్రీట్ఫుడ్లను ట్రై చేస్తుంది. తాజాగా వీరిద్దరూ ఓ కేఫ్ను సందర్శించారు. అక్కడ ఫుడ్ బాగుందంటూ కోహ్లీ ఇన్స్టాలో తెలిపాడు.
“బార్బడోస్లో ఉన్న కేఫ్ A LA మెర్ (CAFE A LA MER) అనే కేఫ్ను మీరు తప్పక విజిట్ చేయండి. అక్కడ మేము తిన్న ఫుడ్ చాలా బాగుంది.” అంటూ కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో రాసుకోచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్గా మారింది.
విరాట్ ప్రస్తుతం ఈ నెలాఖరున మొదలవ్వనున్న ఆసియా కప్ (Asia Cup 2023) కోసం సన్నద్ధమవుతున్నాడు. నిరుడు ఇదే టోర్నీలో ఫామ్లోకి వచ్చిన ఈ స్టార్ ప్లేయర్ మళ్లీ పరుగుల వరద పారించాలనే ఉద్దేశంతో ఉన్నాడు. ఈ మెగా టోర్నీలో 102 రన్స్ చేస్తే కోహ్లీ వన్డేల్లో 13 వేల క్లబ్లో చేరతాడు. మరోవైపు దాదాపు మూడేళ్ల విరామం తర్వాత అనుష్కశర్మ ప్రస్తుతం ‘చక్దే ఎక్స్ప్రెస్’(Chak De Express) సినిమాలో నటిస్తోంది. భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ ఝులన్ గోస్వామి జీవిత కథ ఆధారంగా (Jhulan Goswamy biography) ఈ చిత్రం తెరకెక్కుతోంది. అనుష్క, ఆమె సోదరుడు కర్నేశ్ శర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రాసిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు.