హైదరాబాద్, ఆట ప్రతినిధి: పొలాచ్చి(తమిళనాడు) వేదికగా జరిగిన 62వ జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ స్కేటర్ అనుపోజు కాంతిశ్రీ పతక జోరు కనబరిచింది.
జాతీయ రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన టోర్నీలో పోటీపడ్డ కాంతిశ్రీ రెండు స్వర్ణాలు సహా రెండు రజత పతకాలు కైవసం చేసుకుని సత్తాచాటింది. రోలర్ స్కేటింగ్లో వేర్వేరు విభాగాలైన షోగ్రూపుతో పా క్వాటర్ట్లో పసిడి పతకాలు దక్కించుకున్న కాంతిశ్రీ..సొలో ఇన్లైన్, పేయిర్ స్కేటింగ్లో రజతాలు ఖాతాలో వేసుకుంది.