గురుగ్రామ్: భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ అంకిత రైనా ఐటీఎఫ్ మహిళల టోర్నీ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో అంకిత 4-6, 6-2, 6-4తో జాక్వెలిన్ కాబాజ్ (స్వీడన్)పై విజయం సాధించింది. రెండో సీడ్గా బరిలోకి దిగిన అంకిత.. తొలి సెట్ కోల్పోయినా.. తిరిగి పుంజుకొని వరుస సెట్లలో గెలుపొందింది. మరో క్వార్టర్ఫైనల్లో తెలంగాణ అమ్మాయి యమలపల్లి సహజ 5-7, 6-3, 0-6తో టాప్ సీడ్ డాలియా (స్లొవేనియా) చేతిలో పోరాడి ఓడింది.