దోహా: భారత యువ పిస్టల్ షూటర్ అనీశ్.. ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్కప్లో కాంస్య పతకంతో మెరిశాడు. శుక్రవారం జరిగిన పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ విభాగంలో 21 ఏండ్ల అనీశ్ 27 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. అంతకుముందు క్వాలిఫయింగ్ రౌండ్లో 581 పాయింట్లు ఖాతాలో వేసుకున్న అనీశ్ ఏడో స్థానంతో ఫైనల్లో అడుగుపెట్టాడు.
ఈ విభాగంలో ప్రపంచకప్లో భారత్కు ఇదే తొలి పతకం కావడం విశేషం. ఇటీవల ఆసియా షూటింగ్ చాంపియన్షిప్లో పతకం సాధించడంతో వచ్చే ఏడాది జరగనున్న పారిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్న అనీశ్.. అదే జోరు కొనసాగించాడు. పీటర్ ఫ్లోరిన్ (జర్మనీ), లీ యూహెంగ్ (చైనా) వరుసగా స్వర్ణ, రజతాలు దక్కించుకున్నారు.