హైదరాబాద్, ఆట ప్రతినిధి: సౌదీఅరేబియా జాతీయ క్రీడల్లో తెలుగు షట్లర్ మహాద్ మెరుపులు మెరిపించాడు. బాలుర బ్యాడ్మింటన్ విభాగంలో పసిడి పతకంతో ఆకట్టుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి తెలుగు ప్లేయర్గా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టోర్నీ ఆద్యంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన ఈ యువ షట్లర్.. సౌదీ యువరాజు ఫహాద్బిన్ జలానీ చేతుల మీదుగా స్వర్ణంతో పాటు రూ.2 కోట్ల ప్రైజ్మనీ అందుకున్నాడు. ఆంధప్రదేశ్కు చెందిన 17 ఏండ్ల మహాద్ ప్రస్తుతం రియాద్లో పదకొండో తరగతి చదువుతున్నాడు. హైదరాబాద్ పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్న మహాద్..భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు. సౌదీ అరేబియా తరఫున ఒలింపిక్స్లో పతకం సాధించడమే తన ఏకైక లక్ష్యమని పేర్కొన్నాడు.