T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ టోర్నీకి మరో ఏడు రోజులే ఉంది. ఇప్పటికే అన్ని జట్లు తుది బృందాలను ప్రకటించేశాయి. ఎట్టకేలకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) సైతం టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ను అనౌన్స్ చేసింది. బాబర్ ఆజాం(Babar Azam) కెప్టెన్గా 15 మందితో స్క్వాడ్ను శుక్రవారం అధికారికంగా వెల్లడించింది.
సీనియర్లు ఇమద్ వసీం, మహ్మద్ అమిర్లకు తుది బృందంలో చోటుదక్కగా.. ఐదుగురు కుర్రాళ్లు జాక్పాట్ కొట్టారు. అబ్రార్ అహ్మద్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, సయీం అయుబ్, ఉస్మాన్ ఖాన్, అజాం ఖాన్(Azam Khan)లకు ఇదే తొలి వరల్డ్ కప్.
Our fans unveil Pakistan’s squad for the ICC Men’s #T20WorldCup 2024 in the West Indies & USA 🇵🇰🤩
Let’s go, team! 🙌#WeHaveWeWill | #BackTheBoysInGreen pic.twitter.com/7nsJwPtyn0
— Pakistan Cricket (@TheRealPCB) May 24, 2024
పాకిస్థాన్ స్క్వాడ్ : బాబర్ ఆజాం(కెప్టెన్), అబ్రర్ అహ్మద్, అజాం ఖాన్, ఫఖర్ జమాన్, హ్యారిస్ రవుఫ్, ఇఫ్తికార్ అహ్మద్, ఇమద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమిర్, మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, సయీం అయుబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిది, ఉస్మాన్ ఖాన్.
పాక్ ప్రస్తుతం డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్(England)తో టీ20 సిరీస్ ఆడుతోంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్ (Team India), పాక్లు గ్రూప్ ‘ఏ’లో ఉన్నాయి. ఇరుజట్లు జూన్ 9న న్యూయర్క్ వేదికగా తలపడనున్నాయి. భారీ అంచనాలు నెలకొన్న ఈ మ్యాచ్ టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడిన విషయం తెలిసిందే.