PM Modi | సుమారు ఏడాది కాలంగా మణిపూర్లో జరుగుతున్న హింసాకాండకు ఇకనైనా చరమగీతం పాడాలని ప్రజాసంఘాలు గొంతెత్తుతున్న వేళ ప్రముఖ క్రీడాకారుడు, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఎ) ఫైటర్ చుంగ్రెంగ్ కొరెన్ వారికి మద్దతు పలికాడు. మణిపూర్కే చెందిన అతడు.. ఎంఎంఎ టోర్నీ గెలిచిన తర్వాత తమ రాష్ట్రంలో తలెత్తిన పరిస్థితులపై గొంతెత్తాడు. అక్కడ నెలకొన్ని హింస ద్వారా రోజూ జనం చస్తున్నారని, చిన్నపిల్లలకు చదువు దూరమైందని, రిలీఫ్ క్యాంపులలో ఆహార నిల్వలు అయిపోయి జనం ఆకలిపస్తులుంటున్నారని కన్నీరుమున్నీరయ్యాడు.
గువహతి వేదికగా ముగిసిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత కొరెన్ మాట్లాడుతూ… ‘మోడీ.. ఇది నా వినమ్రపూర్వక విన్నపం. మణిపూర్లో ఏడాదికాలంగా హింసాకాండ కొనసాగుతోంది. జనం రోజూ చస్తున్నారు. శరణార్థి గృహాలలో కూడా వేలాది మంది జనం ఉన్నారు. వాళ్ల ఆహార అవసరాలను తీర్చే సరుకులు నిండుకున్నాయి. చిన్నపిల్లలు బడులు లేక చదువులకు దూరమవుతున్నారు. మణిపూర్ భవిష్యత్ను తలుచుకుంటేనే మాకు ఆందోళనగా ఉంది. దయుంచి ఒక్కసారి మణిపూర్కు రండి. ఇక్కడ వీలైనంత త్వరగా శాంతిని నెలకొల్పండి…’ అంటూ కన్నీరుమున్నీరయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
Interim champion Chungreng Koren has a request for @PMOIndia and reminds him about the ongoing violence in Manipur.
“This Is My Humble request. Violence is happening in manipur.
It has been almost one year. people are dying and many people are in the relief camps. There is food… pic.twitter.com/UVWjmjixX7— Mohammed Zubair (@zoo_bear) March 11, 2024
మణిపూర్లో ఉన్న మైతేయి, కుకీ తెగల మధ్య నెలకొన్న ఘర్షణలు నానాటికీ తీవ్రమవుతున్నాయి. అక్కడ ఇంటర్నెట్పై నిషేధంతో పాటు పౌరహక్కులను అణిచివేస్తున్నదని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారమే ఇక్కడ దాదాపు 220 మంది మరణించారని, 60 వేల మంది స్థానభ్రమణం చెందారని నివేదికల ద్వారా తెలుస్తోంది.