హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ పోటీల్లో అమన్రాజ్ విజేతగా నిలిచాడు. శనివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో పాట్నాకు చెందిన అమన్ టూ అండర్ 68తో గెలుపొందాడు. ఈ సీజన్లో అతడికి ఇది రెండో గోల్ఫ్ టైటిల్ కాగా మొత్తంగా కెరీర్లో మూడోది.
దీంతో, అమన్ 18-అండర్ 262 పాయింట్లతో అగ్రస్థానానికి చేరాడు. ట్రోఫీతో పాటు రూ. కోటి నగదు బహుమతి సొంతం చేసుకున్నాడు. మానసికంగా దృఢంగా ఉండడం వల్లనే ఈ ఏడాది రెంటు టైటిళ్లు సాధించానని, ఈరోజు మాత్రం ఒక్కో షాట్పైనే దృష్టి పెట్టి ఫలితం సాధించానని అమన్ తెలిపాడు. మైసూర్కు చెందిన యశస్ చంద్ర (63-67-68-65) 65 పాయింట్లతో 17 అండర్ 263తో రన్నరప్గా నిలిచాడు.