న్యూఢిల్లీ: ఒమన్ వేదికగా జరిగిన మహిళల ఆసియాకప్ హాకీ టోర్నీలో టైటిల్ విజయానికి అందరూ అర్హులని భారత కెప్టెన్ నవ్జ్యోత్కౌర్ పేర్కొంది. తొలిసారి జరిగిన ఆసియాకప్ టోర్నీ టైటిల్ గెలవడం ద్వారా భారత్..ప్రపంచకప్నకు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో కౌర్ స్పందిస్తూ ‘ఈ విజయం ఎంతో మధురమైంది.
యువ ప్లేయర్లు ఎలాంటి బాధ్యతనైనా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. మమ్మల్ని ఇలా తీర్చిదిద్దినందుకు కోచ్ సౌందర్యకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రతీ ఒక్కరు సమిష్టిగా రాణించడం వలన సాధ్యమైన ఈ విజయానికి అందరూ అర్హులే’ అని అంది.