హైదరాబాద్, జూన్1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ వేదికగా మరో ప్రతిష్ఠాత్మక టోర్నీకి రంగం సిద్ధమైంది.అంచనాలకు మించి సాగిన సీఎం కప్-2023టోర్నీకి కొనసాగింపుగా, రాష్ట్ర గురుకులాల ఆధ్వర్యంలో ఫిడే రేటింగ్ చెస్ టోర్నీకి నేడు తెరలేవనుంది. యూసుఫ్గూడ కోట్ల విజయ్భాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియం వేదికగా మూడు రోజుల పాటు జరుగనున్న టోర్నీలో ఫిడే 1600 రేటింగ్ లోపు ప్లేయర్లు పోటీపడనున్నారు.
దేశంలోని 17 రాష్ట్రాల నుంచి 709 మంది ప్లేయర్లు వయసుతో సంబంధం లేకుండా సత్తాచాటబోతున్నారు. గత ఏప్రిల్లో ఓపెన్ ఫిడే రేటింగ్ టోర్నీని విజయవంతమైన నేపథ్యంలో రాష్ట్ర గురుకులాల ఆధ్వర్యంలో జాతీయ స్థాయి చెస్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి రొనాల్డ్ రాస్ గురువారం పేర్కొన్నారు. టోర్నీ ప్రైజ్మనీగా రూ.4,99,999 నగదు ప్రోత్సాహకంగా ప్రకటించగా, 113 మందికి నగదు పురస్కారాలు, ట్రోఫీలు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.