నేటి నుంచి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్
న్యూఢిల్లీ: ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా సారథ్యంలో భారత అథ్లెట్ల బృందం శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ చాంపియన్షిప్ బరిలో దిగేందుకు సమాయత్తమైంది. ఇప్పటి వరకు భారత్ నుంచి ఈ పోటీల్లో అంజూబాబి జార్జ్ (కాంస్యం, లాంగ్జంప్) మాత్రమే పతకం నెగ్గింది. ఆ తర్వాత మరే అథ్లెట్ ఈ వేదికపై మెడల్ సాధించలేకపోగా.. ఆ లోటు భర్తీ చేసేందుకు నీరజ్ చోప్రా సిద్ధమవుతున్నాడు.
ఇటీవల డైమండ్ లీగ్లో చక్కటి ప్రదర్శన కనబర్చిన నీరజ్.. రెండుసార్లు తన వ్యక్తిగత రికార్డును మెరుగుపర్చుకున్నాడు. 90 మీటర్లకు దరిదాపుల్లో ఉన్న నీరజ్ ఇదే జోష్లో వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో దేశానికి తొలి పసిడి అందించాలని తహతహలాడుతున్నాడు. మరోవైపు లాంగ్జంప్లో మురళీ శ్రీశంకర్ ఆశలు రేపుతుంటే.. పురుషుల 3 వేల మీటర్ల స్టీపుల్చేజ్లో అవినాష్.. షాట్పుట్లో తజిందర్పాల్ సింగ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.