హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ యూత్ సెయిలింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ సెయిలర్లు సత్తాచాటారు. ముంబై వేదికగా జరిగిన పోటీల మిక్స్డ్ కేటగిరీలో అలేఖ్య-అఖిల్ జోడీ రజత పతకంతో మెరిసింది. సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న అలేఖ్య, త్రిషా అంతర్జాతీయ సెయిలర్లకు గట్టి పోటీనిస్తూ వెండి పతకం సాధించడం విశేషం.