దోహా: ఖతార్లో ఆదివారం నుంచి ఫుట్బాల్ వరల్డ్కప్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. అయితే ఫుట్బాల్ మ్యాచ్లు జరిగే స్టేడియాల వద్ద మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. మొత్తం 8 స్టేడియాల్లో మ్యాచ్లను నిర్వహించనున్నారు. అయితే అన్ని స్టేడియాల వద్ద ఆ నిషేధం కొనసాగనున్నది. టోర్నీ ప్రారంభానికి రెండు రోజుల ముందు ఫిఫా తన నిర్ణయాన్ని మార్చుకున్నది.
నిజానికి స్టేడియాల్లోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే మద్యం అమ్మేందుకు ముందుగా ప్లాన్ వేశారు. కానీ ఆ ప్లాన్ను మార్చేశారు. అయితే స్టేడియాల్లోని కార్పొరేట్ ఏరియాల్లో మాత్రం మద్యం అమ్మే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం ఖతార్, ఈక్వెడార్ మధ్య మ్యాచ్తో వరల్డ్కప్ టోర్నీ ప్రారంభంకానున్నది.
ఫిఫాకు బడ్వైజర్ కంపెనీ మేజర్ స్పాన్సర్. ఖతార్ నిర్ణయం పట్ల ఆ కంపెనీ తొలుత వ్యతిరేకత వ్యక్తం చేసినా.. ఆ తర్వాత తన ట్వీట్ను డిలీట్ చేసింది.