బెంగళూరు: గాయం నుంచి తిరిగి కోలుకున్న ఆల్రౌండర్ అక్షర్ పటేల్ టెస్టు జట్టులోకి వచ్చాడు. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తప్పించి అతడి స్థానంలో అక్షర్ను తీసుకున్నట్లు బీసీసీఐ అధికారి తెలిపారు. కాలి గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన అక్షర్.. ఇటీవల కరోనా వైరస్ బారిన కూడా పడ్డాడు. ప్రస్తుతం అతడు పూర్తి ఫిట్గా ఉండటంతో బ్యాకప్ ఆటగాడైన కుల్దీప్ను తప్పించి అక్షర్ను జట్టులో చేర్చారు.