హైదరాబాద్, ఆట ప్రతినిధి: శ్రీలంక వేదికగా జరిగిన ఏషియన్ స్కూల్స్ చెస్ చాంపియన్షిప్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన ఆకాశ్ రజత పతకంతో మెరిశాడు. భారత్కే చెందిన ఉజ్జయిన్ భట్టాచార్యతో కలిసి టీమ్ ఈవెంట్లో ఆకాశ్ అద్భుత ప్రతిభ కనబరిచాడు.
ర్యాపిడ్, క్లాసిక్, బ్లిట్జ్ ఈవెంట్లలో ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ ద్వితీయ స్థానంలో నిలిచిన షేక్పేట చెస్ అకాడమీకి చెంది న ఆకాశ్ ప్రదర్శన పట్ల ఎస్సీ గురుకుల అధ్యాపక బృందం అభినందనలు తెలిపింది.