చెన్నై: ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్లో ఆకాశ్ మద్వాల్(Akash Madhwal) తన సూపర్ షోతో అదరగొట్టాడు. ఈ ముంబై ఇండియన్ బౌలర్స్ దెబ్బకు లక్నో సూపర్ గెయింట్స్ దారుణంగా ఓటమిపాలైంది. బుధవారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 81 రన్స్ తేడాతో నెగ్గింది. అయితే ఆ మ్యాచ్లో మద్వాల్ 3.3 ఓవర్లు వేసి అయిదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో చాలా తక్కువ మ్యాచ్లే ఆడిన ఆ బౌలర్ ఇప్పుడు ఓ సెన్షేషన్ క్రియేట్ చేస్తున్నాడు. అనిల్ కుంబ్లే, జస్ప్రీత్ బుమ్రా లాంటి స్టార్ల తరహాలో క్రేజ్ కొట్టేశాడు.
నాలుగేళ్ల క్రితం వరకు కూడా మద్వాల్ టెన్నిస్ బాల్తోనే క్రికెట్ ఆడేవాడు. ఇటీవలే అతను రెడ్ బాల్తో క్రికెట్ ఆడడం ప్రారంభించాడు. ఇంజినీరింగ్ చదవిన మద్వాల్ది ఉత్తరాఖండ్. అయితే 2022లో గాయపడ్డ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో ఆకాశ్ మద్వాల్ను ముంబై జట్టు ఎంపిక చేసుకున్నది.
2019లో ఉత్తరాఖండ్ కోచ్ వాసిమ్ జాఫర్ దృష్టిలో పడ్డాడు మద్వాల్. ప్రస్తుత కోచ్ మనీశ్ జా కూడా మద్వాల్ యాక్షన్ను లైక్ చేశాడు. దీంతో అతను పూర్తి స్థాయి క్రికెటర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. 2023 దేశవాళీ క్రికెట్ సీజన్లో ఉత్తరాఖండ్ జట్టుకు కెప్టెన్గా ఎన్నియ్యాడు.
భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్తో .. మద్వాల్కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ ఇద్దరూ ఉత్తరాఖండ్లోని ఒకే ప్రాంతానికి చెందినవారు. పంత్కు శిక్షణ ఇచ్చిన అవతార్ సింగ్ వద్దే మద్వాల్ కూడా క్రికెట్ పాఠాలు నేర్చుకున్నాడు.
క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్తో జరిగే మ్యాచ్లోనూ మద్వాల్ రాణిస్తాడని ఆశిస్తున్నారు. గత ఏడాది అతన్ని సపోర్ట్ బౌలర్గా తీసుకున్నామని, కానీ జోఫ్రా లేకపోవడంతో.. మద్వాల్లో నైపుణ్యం ఉన్నట్లు గుర్తించామని, అందుకే అతని ఛాన్స్ ఇచ్చినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.
మధ్వాల్ ఆడింది ఏడు ఐపీఎల్ మ్యాచ్లే. కానీ ముంబయి క్వాలిఫయర్స్-2 వరకు రావడంలో మధ్వాల్ కీలకపాత్ర పోషించాడు. లీగ్ దశలో సన్రైజర్స్తో చివరి మ్యాచ్లో 4 వికెట్లు పడగొట్టిన అతడు.. 5 వికెట్లతో ఎలిమినేటర్లో లఖ్నవూ పనిపట్టాడు. ఈ ఐపీఎల్లో 7 మ్యాచ్లు ఆడిన అతడు 13 వికెట్లు తీయడం విశేషం.