బెంగళూరు: బర్మింగ్హామ్ వేదికగా జరుగనున్న అంతర్జాతీయ అంధుల స్పోర్ట్స్ ఫెడరేషన్(ఐబీఎస్ఏ)వరల్డ్ గేమ్స్లో భారత పురుషుల, మహిళల జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ నెల 18 నుంచి 27 వరకు టోర్నీలో పోటీపడే భారత పురషుల క్రికెట్ జట్టుకు ఆంధప్రదేశ్కు చెందిన అజయ్కుమార్రెడ్డి కెప్టెన్గా వ్యవహరించనుండగా, వెంకటేశ్వర్రావు వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు.
మహిళల జట్టుకు వర్ష కెప్టెన్గా వ్యవహరించ నుంది. జట్లను ప్రకటించిన జాతీయ అంధుల క్రికెట్ సమాఖ్య(సీఏబీఐ) జెర్సీలను విడుదల చేసింది. బర్మింగ్హామ్లో జరుగనున్న వరల్డ్గేమ్స్లో తొలిసారి క్రికెట్ను ప్రవేశపెట్టారు.