AFC Asian cup bid | ఏఎఫ్సీ ఆసియా కప్ను నిర్వహించే ఆతిథ్య బిడ్ను భారత్ ఉపసంహరించుకున్నది. ఈ మేరకు అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య సోమవారం ప్రకటించింది. ఈ ఈవెంట్ను హోస్ట్ చేసే హక్కు కోసం భారత్తో పాటు సౌదీ అరేబియా దేశాలు పోటిపడుతున్నాయి. ఇప్పుడు భారత్ బిడ్ను ఉపసంహరించుకోవడంతో ఈవెంట్ నిర్వహణకు సౌదీ అరేబియాకు మార్గం సుగమం అవుతుంది.
ఏఎఫ్సీ ఆసియా కప్ పోటీలను 2027 లో నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్కు ఆతిథిగా ఉండేందుకు ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) తొలుత సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే, ఈవెంట్ నిర్వహణ కన్నా దేశంలో సరైన ఫుట్బాల్ నిర్మాణానికి పునాదులు నిర్మించడంపై దృష్టి సారించడం ముఖ్యమని సమాఖ్య భావిస్తున్నది. పోటీకి వేదికను ఏర్పాటు చేయడానికి రేసు నుంచి తప్పుకోవాలని భారత ఫుట్బాల్ సమాఖ్య నిర్ణయించుకున్నది.
ఏఎఫ్సీ ఆసియా కప్ వంటి పెద్ద ఈవెంట్లను నిర్వహించడం గురించి ఆలోచించే ముందు సరైన ఫుట్బాల్ స్థితిగతులపై ఆలోచించడం, గట్టి పునాదులు వేయడంపై మా దృష్టి అంతా ఉన్నదని ఎగ్జిక్యూటివ్ కమిటీ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో క్రీడలను బలోపేతం చేయడానికి ప్రాథమిక లక్ష్యాలను సాధించడంపై ప్రస్తుతం దృష్టి కేంద్రీకరించనున్నట్లు ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు కళ్యాణ్ చౌబే తెలిపారు. ఏఐఎఫ్ఎఫ్ సెక్రటరీ జనరల్ డాక్టర్ షాజీ ప్రభాకరన్ కూడా ఈ నిర్ణయం పట్ల తన మద్దతును ప్రకటించారు.