Afghanistan Tour of India: రెండ్రోజుల క్రితం ముగిసిన వన్డే వరల్డ్ కప్లో అనూహ్యమైన ఫలితాలతో విమర్శకుల ప్రశంసలు పొందిన అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు.. తొలిసారి భారత పర్యటనకు రానుంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో అఫ్గానిస్తాన్.. భారత్తో భారత్ వేదికగా తలపడుతుండటం ఇదే ప్రథమం. గతంలో ఆ జట్టు 2018లో బెంగళూరు వేదికగా జరిగిన ఏకైక టెస్టు ఆడేందుకు వచ్చింది గానీ వైట్ బాల్ క్రికెట్లో మాత్రం ఇదే తొలిసారి.. జనవరి 11 నుంచి 17 వరకు భారత్తో అఫ్గాన్ మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ విషయాన్ని అఫ్గాన్ క్రికెట్ బోర్డు నిర్ధారించింది.
భారత్, అఫ్గాన్లు ఇప్పటివరకూ ఐసీసీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్వహించే మ్యాచ్లలో తప్ప నేరుగా తలపడింది లేదు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలను పెంచుకునేందుకు గాను ఈ సిరీస్ ఉపయోగపడుతుందని ఇరుదేశాల బోర్డు ప్రతినిధులు తెలిపారు. వాస్తవానికి మూడు మ్యాచ్ల ఈ సిరీస్ను ఈ ఏడాది జూన్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ముగిసిన తర్వాతే నిర్వహించాలని భావించినా అప్పుడు వీలు కాలేదు.
𝐈𝐍𝐃𝐈𝐀, 𝐖𝐄 𝐀𝐑𝐄 𝐂𝐎𝐌𝐈𝐍𝐆 𝐀𝐆𝐀𝐈𝐍 🚨
AfghanAtalan are all set to meet Team India in a three-match T20I series in early January next year. 🤩
More 👉: https://t.co/xQmpQtNWuR pic.twitter.com/BpITUbzM3W
— Afghanistan Cricket Board (@ACBofficials) November 21, 2023
భారత్-అఫ్గాన్ షెడ్యూల్ వివరాలు:
తొలి టీ20 : జనవరి 11న ఐఎస్ బింద్రా స్టేడియం, మొహాలి
రెండో టీ20 : జనవరి 14న హోల్కర్ స్టేడియం, ఇండోర్
మూడో టీ20 : జనవరి 17న చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు