న్యూఢిల్లీ: ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో అఫ్ఘానిస్థాన్ దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించింది. దాంతో తొలి 15 ఓవర్లలో జట్టు స్కోర్ 100 పరుగుల మార్కును దాటింది. కానీ ఆ తర్వాత ఇబ్రహీం జడ్రాన్ ఔటైన దగ్గరి నుంచి వికెట్ల పతనం కొనసాగింది. వెంటవెంటనే వికెట్లు పడిపోయాయి.
ఇంగ్లండ్ బౌలర్ రూట్ బౌలింగ్లో షాహిదీ (14) బౌల్డ్ అయ్యాడు. ఐదో వికెట్ రూపంలో పెవిలియన్కు చేరుకున్నాడు. అప్పటికి టీమ్ స్కోర్ 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు. అంతకుముందు అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇబ్రహీం జడ్రాన్, రహమత్ షా, రహమానుల్లా గుర్బాజ్ వరుసగా ఔటయ్యారు.