హైదరాబాద్: సెయింట్ డెనిస్ రీయూనియన్ బ్యాడ్మింటన్ టోర్నీలో శ్రీనిధి ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(ఎస్ఎన్ఐఎస్టీ) విద్యార్థి దొడ్డవరపు అచ్యుత్ ఆదిత్యరావు కాంస్య పతకంతో మెరిశాడు. టోర్నీ సెమీఫైనల్లో ఆదిత్య రావు, వెంకట హర్షవర్ధన్ జోడీ 21-11, 21-12తో జపాన్ ద్వయంపై విజయం సాధించింది. నిలకడగా రాణిస్తున్న ఆదిత్య.. బీడబ్ల్యూఎఫ్ డబుల్స్ ర్యాంకింగ్స్లో ప్రస్తుతం 200వ ర్యాంక్లో కొనసాగుతున్నాడు.