Faisal Halim | కౌలాలంపూర్: మలేషియా ఫుట్బాల్ జట్టు సభ్యుడు ఫైసల్ హలిమ్పై గుర్తుతెలియని ఆగంతకుడు యాసిడ్ దాడికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కౌలాలంపూర్కు అనుకుని ఉన్న పెటలింగ్ జయ జిల్లాలో ఆదివారం ఓ మాల్కు వచ్చిన ఫైసల్పై దుండగుడు యాసిడ్ పోసినట్టు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో అతడి మెడ, భుజాలు, ఛాతి, చేతుల వద్ద చర్మం స్వల్పంగా కాలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఫైజల్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.