కొలంబో: ఆసియాకప్-2023 సూపర్-4లో భాగంగా భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ఇవాళ మ్యాచ్ జరుగనుంది. అయితే, శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రేమదాస అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగాల్సిన ఈ మ్యాచ్కు వరుణ గండం పొంచి ఉన్నది. కొలంబోలో గత కొన్ని రోజులుగా వర్షాలు పడుతుండటంతో ఈ మ్యాచ్ సజావుగా సాగుతుందా.. లేదంటే గ్రూప్ స్థాయి మ్యాచ్లాగే ఈ మ్యాచ్ కూడా వర్షం వల్ల రద్దవుతుందా అనే అనుమానాలు నెలకొని ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం కొలంబోలో వాతావరణం పొడిగా ఉందని తెలిపింది. ప్రేమదాస స్టేడియంపై కేవలం తేలికపాటి మబ్బులు మాత్రమే ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు ప్రేమదాస స్టేడియంపై ఆకాశాన్ని ఫొటో తీసి ట్వీట్ చేసింది. మరోవైపు భారత వికెట్ కీపర్, బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా స్టేడియంపై పొడి వాతావరణాన్ని తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో ఇవాళ్టి మ్యాచ్కు వరుణుడు అడ్డంకిగా మారకపోవచ్చనే ఆశలు చిగురిస్తున్నాయి. ఇదిలావుంటే ఇవాళ మధ్యాహ్నం తర్వాత ప్రేమదాస స్టేడియం పరిసరాల్లో వర్షం పడే అవకాశం 49 శాతం వరకు ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 51 శాతం మాత్రం వర్షం పడే అవకాశం లేదంటున్నారు. అయితే, తాజా వాతావరణ పరిస్థితిని బట్టి చూస్తే మాత్రం మ్యాచ్ జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నట్లు సమాచారం.
#WATCH | Sri Lanka: Visuals from Colombo where India will face Pakistan in the Super 4 stage of the Asia Cup 2023. pic.twitter.com/laxsjLJWyW
— ANI (@ANI) September 10, 2023