దుబాయ్ : శుక్రవారం ఆరంభం కానున్న ఏసీసీ పురుషుల అండర్-10 ఆసియాకప్ క్రికెట్ టోర్నమెంట్లో తొలి రోజు భారత యువ జట్టు శుక్రవారం అఫ్గానిస్థాన్తో తలపడుతుంది. అదేరోజు పాకిస్థాన్ నేపాల్ను ఢీకొంటుంది. ఎమిరేట్స్ క్రికట్ బోర్డు నిర్వహిస్తున్న ఈ 50 ఓవర్ల టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పోటీపడుతున్నాయి. ఇండియా, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, నేపాల్ గ్రూప్-ఎలో, బంగ్లాదేశ్, శ్రీలంక, జపాన్, ఆతిథ్య యూఏఈ పూల్-బిలో తలపడతాయి. రెండు గ్రూపులలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు 15వ తేదీన సెమీఫైనల్స్లో పోరాడతాయి. 17వ తేదీన దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఫైనల్ జరుగుతుంది. కాగా గ్రూపు మ్యాచ్లు ఐసీసీ అకాడమీ ఓవల్స్లో జరుగనున్నాయి. మ్యాచ్లో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9.30గం.(భారత కాలమానం ఉదయం 11గం.)లకు ప్రారంభమౌతాయి.