అబుదాబి: భారత యువ గ్రాండ్మాస్టర్.. తెలంగాణకు చెందిన అర్జున్ ఇరిగైసి అబుదాబి మాస్టర్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచాడు. గురువారం చివరి రౌండ్లో స్పెయిన్కు చెందిన డేవిడ్ గుజ్జారొను ఓడించిన అర్జున్.. 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. 9 రౌండ్ల పాటు సాగిన ఈ టోర్నీలో అర్జున్.. ఆరు విజయాలు, మూడు డ్రాలతో విజేతగా అవతరించాడు.