Abu Dhabi Open : భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జా, బెథనీ మటెక్ (అమెరికా) జోడీకి అబూదాబీ ఓపెన్లో చుక్కెదురైంది. తొలి రౌండ్లోనే ఈ జంట ఓటమిపాలైంది. కిర్స్టెన్ ఫ్లిప్కెన్స్ (బెల్జియం), లారా సిగ్మండ్ (జర్మనీ) జోడీ 6-3, 6-4తో సానియా- బెథనీపై గెలుపొందింది. గంట 13 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్లో వరుస సెట్లలో ఆధిపత్యం ప్రదర్శంచింది.
ఈమధ్యే ముగిసిన ఆస్ట్రేలియన్ ఓపెన్లోనూ సానియా విజేత కాలేకపోయింది. మిక్స్డ్ డబుల్స్లో సానియా – రోహన్ బోపన్న జోడీ రన్నరప్గా నిలిచింది. బ్రెజిల్కు చెందిన లుయిసా స్టెఫానీ, రాఫెల్ మటోస్ ద్వయం 6-2, 6-3తో గెలిచి ట్రోఫీ అందుకుంది. డబుల్స్లో సానియా పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. ఆరు సార్లు గ్రాండ్స్లామ్ విజేత అయిన సానియా త్వరలోనే టెన్నిస్కు విడ్కోలు పలకనుంది. ఫిబ్రవరి 19న ప్రారంభం కానున్న దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ఆమెకు ఆఖరి టోర్నమెంట్.