గ్వాంగ్జు: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-2లో భారత్ రెండు పతకాలు ఖాయం చేసుకున్నది. పురుషుల కాంపౌండ్ టీమ్లో ప్రపంచ నంబర్వన్ జట్టు అమెరికాను భారత ఆర్చర్లు చిత్తు చేసి ఫైనల్కు దూసుకెళ్లగా.. మహిళల కాంపౌండ్ బృందం కాంస్యం కైవసం చేసుకుంది.
గ్వాంగ్జు వేదికగా బుధవారం జరిగిన సెమీ ఫైనల్లో అభిషేక్ వర్మ, అమన్ సైనీ, రజత్ చౌహాన్ జట్టు 234-228 తేడాతో షూటాఫ్లో నెగ్గి పసిడి పోరుకు ఎంపికైంది. స్వర్ణం కోసం ఈనెల 21న ఫ్రాన్స్తో భారత్ తలపడనుంది. మరో సెమీస్లో అవ్నీత్ కౌర్, ముస్కాన్ కిరార్, ప్రియ గుర్జార్తో కూడిన భారత త్రయం.. కొరియా జట్టు చేతిలో రెండు పాయింట్ల తేడాతో ఓడి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.