హాంగ్జూ: ఆసియా క్రీడ(Asian Games)ల్లోని స్క్వాష్ ఈవెంట్లో భారత క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన ఇచ్చారు. అభయ్ సింగ్, అనహత్ సింగ్ జోడికి .. కాంస్య పతకం దక్కింది. మలేషియాకు చెందిన జంట చేతిలో వాళ్లు ఓడిపోయారు. సెమీస్ మ్యాచ్లో అభయ్ జోడి తీవ్ర పోరాటం చేసింది. మిక్స్డ్ ఈవెంట్లో జరిగిన మూడు గేముల్లోనూ అభయ్ జోడి గట్టి పోటీ ఇచ్చింది. అభయ్ జోడి తొలి గేమ్లో ఈజీగా గెలిచింది. కానీ తర్వాత రెండు గేముల్లో మాత్రం మలేషియా జంట పైచేయి సాధించింది. అజ్మన్, కమల్కు చెందిన ఆ జోడి.. రెండు, మూడవ గేముల్లో ఆధిపత్యాన్ని చాటారు. నిజానికి మూడవ గేమ్లో ఓ దశలో అభయ్ జోడి ముందంలో ఉన్నా.. ఆ తర్వాత మలేషియా టీమ్ పుంజుకుని ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఒకవేళ అభయ్ జోడి గెలిచి ఉంటే, ఆ జంట మరో ఇండియన్ జోడి దీపికా-హరిందర్తో ఫైనల్లో ఆడేవారు.
𝗕𝗥𝗢𝗡𝗭𝗘 𝗛𝗢𝗡𝗢𝗥𝗦 𝗙𝗢𝗥 𝗜𝗡𝗗𝗜𝗔!🥉🇮🇳
The squash mixed doubles duo of @abhaysinghk98 and @Anahat_Singh13 clinch a well-deserved Bronze medal at #AsianGames2022👍🏻
Their journey may have ended in the mixed doubles at the Asian Games, but their achievements shine… pic.twitter.com/PjBt5h20r1
— SAI Media (@Media_SAI) October 4, 2023