మెల్బోర్న్: పేస్ ఆల్రౌండర్ మిషెల్ మార్ష్ (96; 13 ఫోర్లు) దుమ్మురేపడంతో పాకిస్థాన్తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా మంచి స్కోరు దిశగా సాగుతున్నది. పాక్ పేసర్లు హమ్జ (3/27), షాహీన్ అఫ్రిది (3/58) ధాటికి ఒక దశలో 16 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్ను మార్ష్, స్మిత్ (50) ఆదుకున్నారు.
అంతకుముందు పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్లో 264 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొని ఆసీస్ ఓవరాల్గా 241 రన్స్ ముందంజలో ఉంది.