అహ్మదాబాద్: సౌతాఫ్రికా స్టార్ బ్యాట్స్మన్, ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు
ప్రాతినిధ్యంవహిస్తున్న ఏబీ డివిలియర్స్ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్లో తక్కువ (3288) బంతుల్లో 5 వేల పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా డివిలియర్స్ చరిత్ర సృష్టించాడు.3554 బంతుల్లో ఈ మైలురాయి అందుకొన్న వార్నర్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అహ్మదాబాద్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో ఏబీడీ ఈ ఘనత సాధించాడు. లీగ్లో 5 వేల పరుగుల మార్క్ అందుకున్న రెండో విదేశీ క్రికెటర్గానూ డివిలియర్స్ నిలిచాడు.
ఐపీఎల్లో 5 వేల పరుగులు పూర్తి చేసిన తొలి విదేశీ బ్యాట్స్మన్గా సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (5390) ఈ రికార్డు నెలకొల్పాడు. లీగ్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ (6041) టాప్లో కొనసాగుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మన్ సురేశ్ రైనా(5,472), ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్(5,456), ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ(5,431) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.