మొహాలీ: భారత్తో జరుగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా అరోన్ ఫించ్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సాధన ఆరంభించింది. వచ్చే నెలలో జరిగే టీ20 ప్రపంచకప్ సన్నద్ధతలో భాగంగా ఇరు జట్లు మూడు టీ20ల్లో తలపడనున్నాయి. ఇందులో భాగంగా మొదటి టీ20 మంగళవారం మొహాలీలో జరుగనున్నది. సిరీస్ కోసం భారత్కు చేరుకున్న ఆస్ట్రేలియా జట్టు ఇక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు శనివారమే సాధన ఆరంభించింది.
ఈ సిరీస్ నుంచి ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్కు విశ్రాంతి కల్పించారు. వార్నర్పై పనిభారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. వార్నర్ స్థానాన్ని కామెరూన్ గ్రీన్తో భర్తీ చేయనున్నారు. వార్నర్తోపాటు మిచెల్ స్టార్క్, మిచెల్ మార్ష్ కూడా గాయాల కారణంగా ఈ సిరీస్కు దూరమయ్యారు.