విచీ(ఫ్రాన్స్): తెలంగాణ యువ అథ్లెట్ జివాంజీ దీప్తి మరోమారు అంతర్జాతీయ వేదికపై తళుక్కుమన్నది. 6వ వర్చస్ గ్లోబల్ గేమ్స్లో దీప్తి రజత పతకంతో మెరుపులు మెరిపించింది. గురువారం జరిగిన మహిళల 400మీటర్ల(టీ20) ఫైనల్ రేసును దీప్తి 58.07 సెకన్ల టైమింగ్తో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. ట్రాక్పై చిరుతను తలపించిన ఈ కల్లెడ వాసి ప్రత్యర్థులను వెనుకకు నెడుతూ పతకాన్ని ముద్దాడింది. అంతర్జాతీయ స్థాయిలో దీప్తికి ఇది మూడో పతకం కావడం విశేషం.
యులియా షూలర్(56.25సె, ఉక్రెయిన్), లిజాన్షిలా యామి(59.42సె, ఈక్వెడార్) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. జాతీయ అథ్లెటిక్స్ కోచ్ రమేశ్ దగ్గర శిక్షణ తీసుకుంటున్న దీప్తి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా పతకాలు కొల్లగొడుతున్నది. పేద కుటుంబం నుంచి దీప్తి అంచలంచెలుగా ఎదుగుతున్నది. పభుత్వం మద్దతుగా నిలిస్తే భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నది.