నోయిడా: భారత క్రికెట్ జట్టు బ్యాటర్ రింకూ సింగ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతడి తండ్రి ఖాన్చంద్ సింగ్ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. స్టేజ్-4 లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన.. గత కొన్ని రోజులుగా అందుకు సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం భారత్లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ సందర్భంగా జింబాబ్వేతో మ్యాచ్కు ముందు తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రింకూ ఉన్నఫళంగా అతడిని చూసేందుకు హాస్పిటల్కు వెళ్లాడు.
అయితే అతడు తిరిగి జట్టులో చేరగా వెంటిలేటర్ సాయంతో ఉన్న ఖాన్చంద్.. శుక్రవారం ఉదయం కన్నుమూశారు. విషయం తెలిసిన వెంటనే రింకూ.. హుటాహుటిన చెన్నై నుంచి ఢిల్లీకి బయల్దేరాడు. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్కు చెందిన ఖాన్చంద్.. ఓ గ్యాస్ ఏజెన్సీలో సిలిండర్లు డెలివరీ చేస్తూనే కొడుకు కలలను నెరవేర్చాడు. రింకూ కెరీర్ ఎదుగుదలలో ఖాన్చంద్ పాత్ర ఎంతో ఉంది.