హైదరాబాద్, ఆట ప్రతినిధి: యువ టెన్నిస్ ప్లేయర్ శ్రీమాన్య రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో నిలకడ కొనసాగిస్తున్నది. స్పెయిన్ వేదికగా జరిగిన ఎఫ్టీఐబీ టోర్నీలో 15 ఏండ్ల శ్రీమాన్య విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో శ్రీమాన్య 6-2, 7-5తో జార్జీనా సాచెల్పై విజయం సాధించింది. ఇటీవలి కాలంలో వరుస విజయాలు సాధిస్తున్న శ్రీమాన్య.. తుదిపోరులో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస సెట్లలో మ్యాచ్ను ముగించింది. అంతకుముందు సెమీఫైనల్లో 6-3, 6-4తో రోసాలినా ఎలిజబెత్ను ఓడించిన శ్రీమాన్య.. క్వార్టర్ ఫైనల్లో 6-4, 6-4తో లారా డియాజ్ గార్సియాను చిత్తు చేసింది.