తాంపెరె: భారత్కు చెందిన 94 ఏండ్ల భగవాణి దేవి సంచలనం సృష్టించింది. వయసు అనేది ఒక అంకె మాత్రమే అని నిరూపిస్తూ ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ టోర్నీలో సత్తాచాటింది. ఫిన్లాండ్ వేదికగా జరిగిన మెగాటోర్నీలో భగవాణి స్వర్ణం సహా రెండు కాంస్య పతకాలతో మెరిసింది. 100మీటర్ల రేసును 24.74 సెకన్లలో ముగించి పసిడి పతకాన్ని ముద్దాడింది. అదే జోరు కనబరుస్తూ షాట్పుట్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని ఖాతాలో వేసుకుంది. తొమ్మిది పదుల వయసులోనూ మెగాటోర్నీలో పతకాలు కొల్లగొట్టిన దేవి ప్రదర్శనను కేంద్ర క్రీడాశాఖ ప్రత్యేకంగా అభినందించింది.