న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి జూహ్లీ చావ్లాపై విధించిన జరిమానాను ఢిల్లీ హైకోర్టు తగ్గించింది. 5జీ టెక్నాలజీని సవాల్ చేస్తూ నటి జూహీ గతంలో కోర్టు కేసు ఫైల్ చేసింది. ఢిల్లీ హైకోర్టులోని డివిజన్ బెంచ్ ఈ కేసును ఇవాళ విచారించింది. 5జీపై కేసు వేసినందుకు మొదట్లో ఆమెపై 20 లక్షల జరిమానా విధిస్తూ సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. ఒకవేళ ఏదైనా ప్రజా కార్యక్రమంలో పాల్గొంటే అప్పుడు జరిమానా తగ్గిస్తామంటూ కోర్టు చెప్పింది. దీంతో ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీతో పనిచేసేందుకు జూహీ అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఆమెపై విధించిన జరిమానాను తగ్గిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ విపిన్ సంఘీ, జస్మీత్ సింగ్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. జూహీపై సింగిల్ జడ్జి చేసిన వ్యాఖ్యలను కూడా ద్విసభ్య ధర్మాసనం రికార్డుల నుంచి తొలగించింది.