టీ 20 స్పెషలిస్ట్గా పేరున్న ఇంగ్లండ్ బ్యాటర్ డేవిడ్ మలన్ తనకు బాగా ఇష్టమైన ఫార్మాట్ వన్డే క్రికెట్ అన్నాడు. ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మొదటి వన్డేలో అతను సెంచరీ చేశాడు. వన్డే క్రికెట్ నా స్ట్రాంగెస్ట్ ఫార్మాట్. ప్రస్తుతం వన్డే జట్టులో చోటు కోసం గట్టి పోటీ ఉంది. అయితే.. నేను ఇలానే ఆడితే కచ్చితంగా వన్డే టీంలో ఆడతాను. నా ముద్ర వేస్తాను అని డేవిడ్ మలన్ అన్నాడు. ఆస్ట్రేలియాతో అడిలైడ్ ఓవల్ మైదానంలో జరిగిన మొదటి వన్డేలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా 46వ ఓవర్ చివరి బంతికి లక్ష్యాన్ని ఛేదించింది. డేవిడ్ వార్నర్ 86 పరుగులు చేశాడు. మలన్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన డేవిడ్ మలన్ ఇంగ్లండ్ తరఫున 20ల్లో విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడాడు. టీ 20 వరల్డ్కప్ టీమ్కిఎంపికయ్యాడు కూడా. అయితే, గాయం కారణంగా సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ల్లో ఆడలేకపోయాడు. కొన్ని ఏళ్లుగా బాగా ఆడుతూ పొట్టి ప్రపంచకప్ చివరి రెండు మ్యాచ్లు ఆడలేకపోవడంతో బాధగా అనిపించింది. గాయం నుంచి కోలుక్ను తర్వాత సెంచరీ సాధించి నా ఫిట్నెస్ నిరూపించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని మలన్ అన్నాడు. టీ 20 వరల్డ్కప్ ఫైనల్లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్పై విజయం సాధించి, రెండోసారి పొట్టి ప్రపంచకప్ని ఎగరేసుకుపోయింది.