హైదరాబాద్, ఆట ప్రతినిధి: కబడ్డీ క్రీడాకారుల సదుపాయాల కోసం ఎల్బీ స్టేడియంలో రూ.50 లక్షలతో సోమవారం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్..కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రాష్ట్రంలో ప్లేయర్ల సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పిస్తున్నది. రాష్ట్రంలోని అన్ని క్రీడా మైదానాల్లో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిభ కల్గిన ప్లేయర్లకు కొదువలేదని, వెన్నుతట్టి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి జగదీశ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.