హైదరాబాద్: ఉజ్జయినీ వేదికగా జరుగుతున్న 36వ జాతీయ మల్లఖాంబ్ చాంపియన్షిప్లో తెలంగాణకు రెండు కాంస్య పతకాలు దక్కాయి. గురువారం జరిగిన టీమ్ విభాగపు పిరమిడ్స్ పోటీల్లో తెలంగాణ జట్టు కాంస్య పతకం సొంతం చేసుకుంది. వ్యక్తిగత విభాగంలో మోహన్ దిమాలె కాంసాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ టోర్నీలో మన రాష్ట్రం నుంచి మొత్తం 48 మంది బరిలోకి దిగారు.