హైదరాబాద్, ఆట ప్రతినిధి: సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా జరుగుతున్న 36వ జాతీయ చెస్ అండర్-13 బాలబాలికల చాంపియన్షిప్లో ఉప్పాల శ్రీరామ్ ఆదర్శ్, విహాన్ కార్తికేయ, శివాంశిక ముందంజ వేశారు. శనివారం జరిగిన వేర్వేరు గేమ్లో వీరు విజయాలు సొంతం చేసుకున్నారు. శ్రీరామ్ ఆదర్శ్ కర్ణాటకకు చెందిన సిద్ధాంత్ పూజపై గెలువగా, విహాన్ కార్తికేయ..శౌనక్ చందాను ఓడించాడు. కార్తికేయ వర్మ..శ్రేయాస్ రాజ్(ఉత్తరప్రదేశ్)తో గేమ్ను డ్రా చేసుకున్నాడు. మరోవైపు బాలికల విభాగంలో క్రితిక..ఆద్య గుప్తా(ఢిల్లీ)తో గేమ్ను డ్రా చేసుకుంది.