హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ సెయిలింగ్ వీక్ హోరాహోరీగా సాగుతున్నది. హుస్సేన్సాగర్ వేదికగా బుధవారం జరిగిన సెయిలింగ్ టోర్నీలో ఆర్మీ యాచింగ్ నోడ్ టీమ్కు చెందిన మోహిత్ సైనీ, గితేశ్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు.
రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్కు చెందిన అశ్విని..బాలికల ఐఎల్సీఏ విభాగంలో టాప్ దక్కించుకుంది. ఇదే విభాగంలో పోటీపడ్డ నేహా ఠాకూర్, షితల్ షెంద్య రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నారు.