హైదరాబాద్, ఆట ప్రతినిధి: గుజరాత్ వేదికగా జరిగే నేషనల్ గేమ్స్ కోసం తెలంగాణ పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నది. గురువారం ఎల్బీ స్టేడియం వేదికగా రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్, సాట్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సన్నాహక శిబిరాన్ని మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు క్రీడాభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నాం. ప్రతీ గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీవోఏ అధ్యక్షుడు వేణుగోపాలాచారి, కార్యదర్శి జగదీశ్వర్, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, ప్రేమ్రాజ్ పాల్గొన్నారు.