Junior World Boxing Championship: అర్మేనియా వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ (ఐబీఏ) జూనియర్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో యువ భారత బాక్సర్లు స్వర్ణాలతో మెరిశారు. పాయల్ (48 కిలోలు), నిషా (52 కిలోలు), ఆకాన్ష (70 కిలోలు) పసిడి పతకాలు సాధించారు. మంగళవారం ముగిసిన ఫైనల్ పోరులో భారత మహిళా బాక్సర్లు ప్రత్యర్థులను చిత్తు చేసి విజేతలుగా నిలిచారు. 48 కిలోల విభాగంలో ఆడిన పాయల్.. అర్మేనియాకే చెందిన పెట్రోసియన్ పై గెలిచింది.
52 కిలోల విభాగంలో ఆసియా యూత్ ఛాంపియన్షిప్ విజేత నిషా.. 5-0 తేడాతో తజకిస్తాన్కు చెందిన అబ్దుల్లాఓయేవా ఫరినోజ్ పై విజయం సాధించింది. మరో తుది పోరులో ఆకాన్ష కూడా 5-0 తేడాతో రష్యాకు చెందిన తైమజోవాను ఓడించింది. మరో ముగ్గురు మహిళా బాక్సర్లు.. విని (57 కిలోలు), సృష్టి (63 కిలోలు), మేఘ (80 కిలోలు)లు రజతాలతో సరిపెట్టుకున్నారు. పురుషుల విభాగంలో సాహిల్ (75 కిలోలు), హేమంత్ (80 కిలోలు), జతిన్ (54 కిలోలు) లు రజతం నెగ్గారు. ఈ టోర్నీలో భారత్ మూడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, ఐదు కాంస్య పతకాలు (మొత్తంగా 17) సాధించి రెండో స్థానంలో నిలిచింది.
The #Golden GIRLS! Many congratulations champions 🥳👏 https://t.co/xZikE8vZca
— SAI Media (@Media_SAI) December 5, 2023
With 3⃣🥇, 9⃣🥈& 5⃣🥉, Team 🇮🇳 shines with a historic medal🏅 tally at the #IBA Junior Boys & Girls #Boxing🥊 Championship 2023, 🇦🇲
Kudos to all our medal winners 🥳 May you keep thriving and shining ✨like this👏🙌 pic.twitter.com/ruOSN8o6hn
— SAI Media (@Media_SAI) December 5, 2023