లండన్: సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటిన దక్షిణాఫ్రికా జట్టు.. ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించింది. లార్డ్స్ వేదికగా మూడు రోజుల్లోనే ముగిసిన పోరులో సఫారీ జట్టు ఇన్నింగ్స్ 12 పరుగుల తేడాతో గెలిచింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 165 పరుగులకే ఆలౌట్ కాగా.. బదులుగా దక్షిణాఫ్రికా 326 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో మరోసారి ఇంగ్లిష్ బ్యాటర్లు తడబడటంతో 149 పరుగులకే కుప్పకూలింది. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన స్టువర్ట్ బ్రాడ్ (35) టాప్ స్కోరర్ కాగా.. దక్షిణాఫ్రికా బౌలర్లలో నోర్జే 3, రబడ, జాన్సెన్, కేశవ్ మహరాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల ప్రదర్శనతో ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ను కకావికలం చేసిన రబడకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య గురువారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది.