దుబాయ్: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పొట్టి ప్రపంచకప్ షెడ్యూలు మంగళవారం విడుదలైంది. ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 దాకా జరిగే ఈ టోర్నీలో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో అక్టోబర్ 24న జరిగే తొలి పోరులో తలపడనున్నది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) అధికారిక షెడ్యూల్ను విడుదల చేసింది. ఒమన్తో పాటు యూఏఈలో నిర్వహించనున్న పొట్టి ప్రపంచకప్లో.. అక్టోబర్ 17న పపువా న్యూ గినియా-ఒమన్తో జరిగే మ్యాచ్తో ఈ మెగా ఈవెంట్ తొలి రౌండ్ మొదలుకానుంది. అక్టోబర్ 23 నుంచి అసలు టోర్నీ (సూపర్ 12 స్టేజ్) ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికాను ఢీ కొననుంది. ఆ మరుసటి రోజు భారత్-పాక్ మ్యాచ్ దుబాయ్లో జరుగనుంది. నవంబర్ 10, 11 తేదీల్లో సెమీఫైనల్స్.. 14న ఫైనల్స్ నిర్వహించనున్నారు. సెమీస్, ఫైనల్స్కు రిజర్వు డే ఉంది.
భారత్ షెడ్యూల్