ముంబై: టీమిండియాకు ఎంపికై సరికొత్త చరిత్ర సృష్టించిన 15 ఏండ్ల యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన తల్లిదండ్రులతో కలిసి జట్టుతో కలిసి ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్నాడు. ఈ పర్యటనలో వారి ప్రయాణ, వసతి ఖర్చులన్నింటినీ బీసీసీఐ భరించనుంది.
యూకే టూర్కు ప్రకటించిన భారత టీ20 జట్టులో వైభవ్కు చోటు దక్కింది. అయితే, అంత చిన్న వయస్సు ఉన్న ఈ కుర్రాడికి ఇలాంటి సుదీర్ఘ పర్యటనల్లో కుటుంబం పక్కన ఉండటం ఎంతో అవసరమని భావించిన బోర్డు, ఈ సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.