హైదరాబాద్, ఆట ప్రతినిధి: బెంగళూరు వేదికగా జరిగిన 28వ జాతీయ బెంచ్ప్రెస్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన తేజావత్ సుకన్య కాంస్య పతకంతో మెరిసింది. శుక్రవారం జరిగిన టోర్నీలో మహిళల 76కిలోల విభాగంలో బరిలోకి దిగిన సుకన్య 100కిలోల బరువెత్తి మూడో స్థానంలో నిలిచింది.
వైశాలీ (107కి), శ్వేత (105కి) వరుసగా స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న సుకన్య ప్రస్తుతం వీఎన్ రాజశేఖర్ వద్ద శిక్షణ తీసుకుంటున్నది.