దుబాయ్ : ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్లో భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ అగ్రస్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హాజిల్వుడ్ టాప్ ర్యాంక్ దక్కించుకున్నాడు. హాజిల్వుడ్ నంబర్వన్ ర్యాంక్ దక్కించుకోవడం ఇదే తొలిసారి. ఇండియాతో జరిగిన వన్డే సిరీస్లో తొలి రెండు వన్డేలలో సత్తా చాటిన మిచెల్ స్టార్క్ మూడో ర్యాంక్కు చేరుకున్నాడు.
ముంబై వన్డేలో భారత్ను గెలిపించిన మహ్మద్ షమీ అయిదు స్థానాలు మెరుగై 28వ ర్యాంక్కు చేరుకున్నాడు. తొలి వన్డేలో 75 పరుగులతో టీమ్ఇండియాను గెలిపించిన రాహుల్ మూడు స్థానాలు మెరుగై 39వ ర్యాంక్కు చేరుకోగా, గిల్, కోహ్లీ అయిదు, ఏడు ర్యాంక్లలో కొనసాగుతున్నారు.