సేలం: బ్యాటర్లంతా సమిష్టిగా కదం తొక్కడంతో నార్త్జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సౌత్జోన్ భారీ స్కోరు చేసింది. శుక్రవారం రెండో రోజు రికీ భుయ్ (103 నాటౌట్) శతక్కొట్టడంతో సౌత్జోన్ 630/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కెప్టెన్ హనుమ విహారి (134), రోహన్ (143) సెంచరీలతో ఆకట్టుకోగా.. బాబా ఇంద్ర జిత్ (65), మయాంక్ అగర్వాల్ (49), కృష్ణప్ప గౌత్ (48), రవితేజ (42) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో మయాంక్ డాగర్ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్త్జోన్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. యష్ ధుల్ (8), మనన్ వోహ్రా (11) క్రీజులో ఉన్నారు. వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ మధ్య కోయంబత్తూర్లో జరుగుతున్న మరో సెమీస్లో వెస్ట్జోన్ భారీ ఆధిక్యం సాధించింది. బౌలర్ల హవా సాగుతున్న పోరులో ఓపెనర్ పృథ్వీ షా (104 నాటౌట్) మెరుపు సెంచరీతో ప్రస్తుతం వెస్ట్జోన్ 259 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
వెంకటేశ్ అయ్యర్కు గాయం..
దులీప్ ట్రోఫీలో భాగంగా యువ ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ గాయపడ్డాడు. వెస్ట్జోన్, సెంట్రల్ జోన్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఫీల్డర్ వేసిన త్రో నేరుగా వెంకటేశ్ తల భాగంలో తగలడంతో మైదానంలోనే కుప్పకూలాడు. వెంటనే స్పందించిన వైద్య సిబ్బంది గ్రౌండ్లోకి అంబులెన్స్ తీసుకురాగా.. కాసేపటికి కోలుకున్న అయ్యర్ నడుచుకుంటూ మైదానం వీడాడు. వైద్య సాయం అనంతరం తిరిగి బ్యాటింగ్కు వచ్చిన వెంకటేశ్ 14 పరుగులు చేసి ఔటయ్యాడు.